గ్రామపంచాయతి కార్యాలయంలో మృతదేహం | Body found in the village panchayat office | Sakshi
Sakshi News home page

గ్రామపంచాయతి కార్యాలయంలో మృతదేహం

Mar 7 2016 9:55 AM | Updated on Mar 28 2018 11:26 AM

గ్రామపంచాయతి కార్యాలయం వెనుక మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది.

గ్రామపంచాయతి కార్యాలయం వెనుక మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లిలో సోమవారం వెలుగుచూసింది. కార్యాలయం ఆవరణలో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement