
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ బుద్వేల్ సాయికృష్ణాకాలనీలోని భారతి నివాసంలో బుధవారం రాత్రి బ్రహ్మకమలాలు విరబూశాయి. సంవత్సరానికి ఒక మారు పూసే ఈ పూలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. భారతి కుటుంబ సభ్యులు వీటికి పూజలు చేసి హారతులు పట్టారు.