Brahma kamal flowers
-
ఆంధ్రలో వికసించిన హిమాలయ బ్రహ్మకమలం
సాక్షి, శ్రీకాకుళం : పొందూరు మండలంలోని మొదలవలసలోని సీతారామారావు ఇంటిలో బ్రహ్మకమలం వికసించింది. ఈ పుష్పం హిమాలయాల్లో మాత్రమే సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీంతో ఈ పుష్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. అలాగే కవిటి మండలంలోని ముత్యాలపేటకు చెందిన సంగీత కళాకారుడు ఆరంగి వెంకటరావుతన పెరటితోటలో మూడేళ్ల కిందట నాటిన బ్రహ్మకమలం చెట్టు ఇప్పుడు విరబూసింది. ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి ఈ మొక్కను వెంకటరావుకు కానుకగా ఇచ్చినట్టు తెలిపారు. -
విరబూసిన బ్రహ్మకమలాలు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ బుద్వేల్ సాయికృష్ణాకాలనీలోని భారతి నివాసంలో బుధవారం రాత్రి బ్రహ్మకమలాలు విరబూశాయి. సంవత్సరానికి ఒక మారు పూసే ఈ పూలు ఎంతో ప్రత్యేకమైనవి. వీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. భారతి కుటుంబ సభ్యులు వీటికి పూజలు చేసి హారతులు పట్టారు. -
బ్రహ్మకమలం మొగ్గేసింది..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది బ్రహ్మకమలం మొక్క. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కట్రోజు శశికళ, రామ్మూర్తి దంపతులు మూడేళ్ల క్రితం ఉత్తరాఖండ్లోని బద్రినాథ్ పుణ్యక్షేత్రం నుంచి ఈ మొక్కను తెచ్చి నాటారు. హిమాలయాల వద్ద చల్లటి వాతావరణంలో బ్రహ్మకమలం ఏపుగా పెరిగి చామంతి పువ్వుల్లా పెద్దపూలు పూస్తుం దని, వాటినే బద్రినాథ్ ఆలయంలో భగవంతుడి పూజకు ఉపయోగిస్తారని తెలిపారు. నాలుగు అడుగుల మేర పెరిగిన వారి ఇంట్లోని మొక్క ఇటీవలే పొడవాటి మొగ్గ తొడిగింది. హిమాలయాల వాతావర ణం ఇక్కడ లేకపోవడంతో త్వరగా విచ్చుకోవడం లేదని ఆ దంపతులు తెలిపారు. - గీసుకొండ