బ్రహ్మకమలం మొగ్గేసింది..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది బ్రహ్మకమలం మొక్క. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కట్రోజు శశికళ, రామ్మూర్తి దంపతులు మూడేళ్ల క్రితం ఉత్తరాఖండ్లోని బద్రినాథ్ పుణ్యక్షేత్రం నుంచి ఈ మొక్కను తెచ్చి నాటారు. హిమాలయాల వద్ద చల్లటి వాతావరణంలో బ్రహ్మకమలం ఏపుగా పెరిగి చామంతి పువ్వుల్లా పెద్దపూలు పూస్తుం దని, వాటినే బద్రినాథ్ ఆలయంలో భగవంతుడి పూజకు ఉపయోగిస్తారని తెలిపారు. నాలుగు అడుగుల మేర పెరిగిన వారి ఇంట్లోని మొక్క ఇటీవలే పొడవాటి మొగ్గ తొడిగింది. హిమాలయాల వాతావర ణం ఇక్కడ లేకపోవడంతో త్వరగా విచ్చుకోవడం లేదని ఆ దంపతులు తెలిపారు. - గీసుకొండ