♦ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం
♦ ముగిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమోచన యాత్ర
♦ అప్పంపల్లిలో బహిరంగ సభ
సాక్షిప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర ముగింపును పురస్కరించుకుని గురువారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచనం కోసం నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి ఎందరో ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని చెప్పారు.
అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని చిన్న చిన్న రాజ్యాలను భారత్లో విలీనం చేయించారని.. అందులో భాగంగానే 17 సెప్టెంబర్ 1948లో తెలంగాణకు విమోచనం కలిగించి నిజాం మెడలు వంచారన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వందలాది మంది నిజాం పోలీసులను ఎదిరించి ఆత్మ బలిదానాలు చేశారన్నారు. వారి త్యాగాలను బీజేపీ ఎన్నటికీ మరువదన్నా రు. 2019లో తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని హన్స్రాజ్ స్పష్టం చేశారు.
తెలంగాణలో గడీల రాజ్యం: లక్ష్మణ్
నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచన పోరాటాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతాలను విజ్ఞాన, స్ఫూర్తి కేంద్రాలుగా మార్చాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో గడీల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. సమైక్య పాలనలో అప్పటి సీఎం రోశయ్యను తెలంగాణ విమోచన దినోత్సవం విషయమై ప్రశ్నించిన కేసీఆర్.. ఈ రోజు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోందన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్రావు, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు నాగురావు నామోజీ, ప్రేమ్రాజ్, సుదర్శన్రెడ్డి, కొండయ్య, ఆచారి, నర్సింహులు, రావుల రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణలో గెలిస్తే విమోచన దినోత్సవం
Published Fri, Sep 8 2017 2:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement