‘ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?’ | Bhatti Vikramarka Slams TRS Over Municipal Elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ చేసిన పనులకు టీఆర్‌ఎస్‌ శంకుస్థాపన: భట్టి

Dec 30 2019 5:37 PM | Updated on Dec 30 2019 5:42 PM

Bhatti Vikramarka Slams TRS Over Municipal Elections - Sakshi

సాక్షి, ఖమ్మం: నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే, సీఎ‍ల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మధిరను అన్నిరకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తేల్చి చెప్పారు. సోమవారం ఆయన ఖమ్మంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ చేసిన పనులకు టీఆర్‌ఎస్‌ పార్టీ శంకుస్థాపన చేస్తుందని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement