TG: కాల్వలో స్కూల్‌ బస్సు బోల్తా.. | Bus overturns into canal Khammam District | Sakshi
Sakshi News home page

TG: కాల్వలో స్కూల్‌ బస్సు బోల్తా..

Jan 2 2026 6:09 PM | Updated on Jan 2 2026 6:17 PM

Bus overturns into canal Khammam District

ఖమ్మం:  ఓ స్కూల్‌ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.  ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్‌పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆ సమయంలో స్కూల్‌ బస్సులో 105 మంది చిన్నారులు ఉన్నారు. అయితే కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవ్‌ చేసే సమయంలో డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ మద్యం సేవించాడని విద్యార్థులు చెబుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement