తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు | Telangana Schools To Run Half Day Schools From March 15 To April 23, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Telangana Half Day Schools: తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

Mar 12 2026 2:35 PM | Updated on Mar 12 2026 3:15 PM

Telangana Schools to Run Half-Day from March 15 to April 23

హైదరాబాద్‌: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. 

ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. మధ్యాహ్న భోజనం సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు పెడతారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆ క్లాసుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. 

పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు.. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని రోజుల్లో పరీక్షా ఆ స్కూళ్లు కూడా యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు పనిచేయాలి. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (DEOs) డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement