భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ | Begumpet Police Help To Missing Older woman | Sakshi
Sakshi News home page

భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ

Apr 14 2020 8:42 AM | Updated on Apr 14 2020 8:56 AM

Begumpet Police Help To Missing Older woman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు. నిన్ను క్షేమంగా ఆశ్రమానికి చేరుస్తాడు’అంటూ డీజీపీ మహేందర్‌రెడ్డి చేసిన ట్వీట్‌ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ విషయం ఏంటంటే బేగంపేటలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నడవలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించింది. తన వివరాలేమీ చెప్పలేకపోతోంది. దీంతో స్థానికులు డయల్‌ 100కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పెట్రోకారు సిబ్బందిలో ఓ కానిస్టేబుల్‌ ఆ వృద్ధురాలిని కన్నతల్లిని ఎత్తుకున్న విధంగా రెండు చేతులతో మోస్తూ తీసుకెళ్లాడు. ఆమె వివరాలు ఆరా తీసి చివరికి ఇంటికి చేర్చారు. ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ బేగంపేట పోలీసులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా కొడుకులా, సోదరుడిలా, తోబుట్టువులా, స్నేహితుడిలా పోలీసులు ఆపద్బాంధవుల్లా వస్తారని అభయమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement