breaking news
woman missed
-
భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : ‘భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు. నిన్ను క్షేమంగా ఆశ్రమానికి చేరుస్తాడు’అంటూ డీజీపీ మహేందర్రెడ్డి చేసిన ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ విషయం ఏంటంటే బేగంపేటలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నడవలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించింది. తన వివరాలేమీ చెప్పలేకపోతోంది. దీంతో స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పెట్రోకారు సిబ్బందిలో ఓ కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని కన్నతల్లిని ఎత్తుకున్న విధంగా రెండు చేతులతో మోస్తూ తీసుకెళ్లాడు. ఆమె వివరాలు ఆరా తీసి చివరికి ఇంటికి చేర్చారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ బేగంపేట పోలీసులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా కొడుకులా, సోదరుడిలా, తోబుట్టువులా, స్నేహితుడిలా పోలీసులు ఆపద్బాంధవుల్లా వస్తారని అభయమిచ్చారు. -
ఆరు నెలల ముందు అదృశ్యం.. అస్థిపంజరమై ప్రస్తుతం
భీమ్గల్: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సమీప అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు శవమై కనిపించాడు. భీమ్గల్కు చెందిన అడపా భూమన్న (41) ఆరు నెలల క్రితం అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శుక్రవారం మెండర గ్రామ సమీపంలోని షీర్ల గుట్టపై ఓ చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ అస్థిపంజరం భూమన్నదిగా గుర్తించారు. చాలా రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల చివరికి అస్తిపంజరం మిగిలినట్లు భావిస్తున్నారు.