వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి? | Baby died in pregnancy with neglect of doctors | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి?

Aug 16 2017 2:29 AM | Updated on Sep 17 2017 5:33 PM

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి?

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి?

పెళ్లై పదేళ్ల తర్వాత కాన్పు కాబోతుందన్న సంతోషం ఆ దంపతుల్లో ఎంతో సేపు నిలవలేదు.

హన్మకొండ ఆస్పత్రిలో ఘటన
 
హన్మకొండ చౌరస్తా: పెళ్లై పదేళ్ల తర్వాత కాన్పు కాబోతుందన్న సంతోషం ఆ దంపతుల్లో ఎంతో సేపు నిలవలేదు. వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి చెందగా.. ఆ తర్వాత కూడా వైద్యం అందక ఆ గర్భిణి నరకయాతన పడింది. ఈ ఘటన హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురానికి చెందిన దారా తిరుపతమ్మకు నెలలు నిండ డంతో భర్త అశోక్‌ నాలుగు రోజుల క్రితం ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అక్కడ పట్టించుకు నేవారే లేకుండా పోయారు.

తిరుపతమ్మకు సోమవారం పురిటినొప్పులు రావడంతో భర్త అశోక్, సోదరి సమ్మక్కలు ప్రైవేటు వాహనంలో హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్ష లు చేసిన సిబ్బంది రాత్రి 8 గంటల సమ యంలో తిరుపతమ్మను చేర్చుకున్నారు. మంచంపై కాకుండా వరండాలో కటిక నేలపైనే తిరుపతమ్మను ఉంచారు. అప్పటికే ఆమెకు ఉమ్మనీరు పోతుండగా.. ఈ విషయా న్ని సమ్మక్క వైద్య సిబ్బందికి చెప్పినా పట్టిం చుకోలేదు. బతిమిలాడినా కనీసం స్పందిం చకపోవగా.. సమ్మక్కను దూషించారే తప్ప.. గర్భిణి వద్దకు వచ్చి చూడలేదు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్య సిబ్బంది గర్భంలోనే శిశువు చనిపోయినట్లు నిర్ధారించారు.

గర్భంలోనే బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తిరుపతమ్మ గుండెలవిసేలా ఎడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. అయితే, కడుపులో ఉన్న మృత శిశువును మాత్రం మంగళవారం సాయంత్రం తీరికగా ఆమెకు వైద్య సహాయం అందించారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే గర్భంలో శిశువు బతికేదని.. గర్భంలోనే శిశువు చనిపోయిందని తెలిసినా.. మంగళవారం సాయంత్రం వరకు వైద్యం అందించలేదని బంధువులు, భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement