* పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
* భర్తపై హత్య కేసు నమోదు చేసే అవకాశం
పుల్కల్: గత సంవత్సరం అక్టోబర్ 16న అనుమానాస్పదంగా మృతి చెందిన పుల్కల్ అంగన్వాడీ టీచర్ పీ రాణమ్మ (37)ను కొట్టడం వల్లే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ కేసును హత్య కేసు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన పుల్కల్ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాణమ్మ గత అక్టోబర్ 16న రాత్రి ఛాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు తెలుపడంతో ఆమెను ప్రథమ చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీకి రెఫర్ చేశారు. అయితే బంధువులు మాత్రం జూబ్లీహిల్స్లోని అపోలో అసుపత్రికి తరలించారు. అక్కడ రాణమ్మకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. బంధువుల ఫిర్యాదు మేరకు అప్పట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరిలో వచ్చిన పోస్టుమార్టం నివేదికలో రాణమ్మది సహజ మరణం కాదని కొట్టడం వల్లే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ కాపీ పోలీసులకు చేరింది. రాణమ్మ శరీరంలోని గుడి వైపు ఛాతి పైన, వెనుక వైపున బలమైన గాయం కావడంతో రక్త ప్రసరణ కాలేదని అందులో పేర్కొన్నారు.
పోస్టు మార్టం నివేదిక ఆధారంగా పుల్కల్ పోలీసులు రాణమ్మ భర్త సంజీవులుపై హత్య కేసు నమోదు చేయనున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ సత్యనారాయణను వివరణ కోరగా రాణామ్మది అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గతంలో కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రాణమ్మ భర్తపై హత్య కేసు నమోదు చేయునున్నట్లు తెలిపారు.
అంగన్వాడీ టీచర్ది హత్యే
Published Mon, Feb 29 2016 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement