చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి | All geared up for Fish medication | Sakshi
Sakshi News home page

చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Jun 6 2015 5:04 PM | Updated on Sep 4 2018 5:16 PM

మృగశిరకార్తె సందర్భంగా ప్రతియేడు అందజేసే చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ : మృగశిరకార్తె సందర్భంగా ప్రతియేడు అందజేసే చేప మందు ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందును పంపిణీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బారికేడ్లను నిర్మించి.. చలువ పందిళ్లు, మంచి నీటి ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం ప్రత్యేక బలగాలను నియమించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement