
కేసీఆర్ తో ఏకే ఖాన్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ను కేసీఆర్ కలసి వచ్చిన వెంటనే ఆయనతో ఏ కే ఖాన్ భేటీ అయ్యారు.
కేసీఆర్ దాదాపు 20 నిమిషాలు నరసింహన్తో సమావేశమయ్యారు. ఓటుకు కోట్లు కేసు పురోగతిని కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసే విషయం గురించి కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఆ వెంటనే కేసీఆర్ ఏకే ఖాన్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.