ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈ | acb caught transco AE in nalgonda | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈ

Apr 2 2015 12:46 PM | Updated on Sep 22 2018 8:22 PM

నల్గొండ జిల్లాలో విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్ కో ఏఈ ఏసీబీకి చిక్కాడు.

నల్గొండ : నల్గొండ జిల్లాలో విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్ కో ఏఈ ఏసీబీకి చిక్కాడు. వివరాలు... జిల్లాలోని నల్లచెలమాలకు చెందిన రైతు హనుమంతు గౌడ్ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం చందంపేట ట్రాన్స్ కో ఏఈ సంతోష్ ని సంప్రదించాడు. కనెక్షన్ కోసం ఏఈ రైతును రూ.25 వేలు లంచం అడిగాడు. ముందుస్తుగా రైతు రూ.10 వేలు అందజేశాడు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏఈ పై నిఘా వేసిన అధికారులు గురువారం రైతు నుంచి మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చందంపేట)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement