లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా దొరికిపోయాడు.
ఆదిలాబాద్ : లంచం తీసుకుంటూ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. మంచిర్యాల రైల్వే ఎస్ఐ కిరణ్ కుమార్ రూ.30 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బిల్లులు పాస్ చేసే నిమిత్తం కిరణ్ కుమార్ లంచం డిమాండ్ చేయటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని రైల్వే ఎస్ఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.