ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీణావాణీల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి సోమవారం డిమాండ్ చేశారు.
వరంగల్: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీణావాణీల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి సోమవారం డిమాండ్ చేశారు. తమ పిల్లల పేరుతో డబ్బులు వసూలు చేసి సొంత ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.
వసూలు చేసిన డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి గ్రామస్తులు మద్దతు తెలిపారు. అనంతరం వారు రహదారిపై రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.