ఆటో, టిప్పర్ ఢీ: 9మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో, టిప్పర్ ఢీ: 9మందికి గాయాలు

Published Sat, Nov 28 2015 3:19 PM

9 injured in road accident

పటాన్‌చెరు (మెదక్) : ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో వెళ్తున్న 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్‌చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఇంద్రేశం గ్రామం నుంచి పటాన్‌చెరు వెళ్తున్న ప్రయాణికుల ఆటోను గ్రామ శివారులోని కల్వర్టు వద్ద టిప్పర్ ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్రగాయాలు కాగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement