వరంగల్ జిల్లాలో 45 నెమళ్లు మృతి | 45 peacocks found dead, poisoning suspected in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో 45 నెమళ్లు మృతి

Jul 21 2014 8:21 AM | Updated on Nov 6 2018 8:50 PM

వరంగల్ జిల్లాలో 45 నెమళ్లు మృతి - Sakshi

వరంగల్ జిల్లాలో 45 నెమళ్లు మృతి

వేటగాళ్ల ఉచ్చుకు జాతీయ పక్షులు బలి అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో నెమళ్లు....

వరంగల్ : వేటగాళ్ల ఉచ్చుకు జాతీయ పక్షులు బలి అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో నెమళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం చీటూరు గ్రామ శివారులో విషాహారం తిని 45మంది నెమళ్లు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేటగాళ్లు  నెమళ్లను విక్రయించేందుకు విషాహారం పెట్టినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే వేటగాళ్ళ పనే అని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement