రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Published Wed, Sep 30 2015 4:34 PM

2 injured in RTC bus-bike collisioned incident

ఖమ్మం(కొత్తగూడెం): ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సిద్దిపల్లి పంచాయతీలోని ఐస్‌ఫ్యాక్టరీ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఆర్‌నగర్ గ్రామానికి చెందిన గుర్రం నర్సింహారావు, గాంధీ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నర్సింహారావు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స అందించేందుకు ఖమ్మంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement