హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గురువారం 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్న జె పూర్ణ చందర్ రావును అక్కడి నుంచి బదిలీ చేసి ఏసీబీ అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించింది. ప్రస్తుతం ఆ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీజీపీ అనురాగ్ శర్మ అక్కడి నుంచి రిలీవ్ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ లో అదనపు డీజీగా పనిచేస్తున్న గోవింద్ సింగ్ ను బదిలీ చేసి సీఐడీ అదనపు డీజీగా నియమించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా ఉన్న జితేందర్ పదోన్నతిపై తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. సీఐడీ ఐజీపీగా పనిచేస్తున్న సౌమ్యామిశ్రాను అక్కడి నుంచి బదిలీ చేసి పోలీస్ వెల్ఫేర్ ఐజీపీగా నియమించారు. స్టీఫెన్ రవీంద్ర పదోన్నతిపై హైదరాబాద్ రీజన్ పశ్చిమ మండలం ఇన్స్ పెక్టర్ జనరల్ గా నియమించారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్ రేంజ్ డీజీఐ అకున్ సబర్వాల్ ను అక్కడి నుంచి బదిలీ చేయగా ఆ స్థానంలో స్టీఫెన్ రవీంద్ర పూర్తి అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. అకున్ సబర్వాల్ ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా నియమించారు.
రాచకొండ ఐజీ శశిధర్ రెడ్డిని పదోన్నతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా నియమించారు. వరంగల్ రేంజ్ డీఐజీ సి. రవివర్మను కరీంనగర్ రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. వై.నాగిరెడ్డి ప్రస్తుతం ఆ పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఐజీ సీఐడీ ఎన్. శివశంకర్ రెడ్డిని నిజామాబాద్ డీఐజీగా నియమించారు. ఖమ్మం ఎస్పీ షహనాజ్ ఖాసింను అక్కడి నుంచి బదిలీ చేసి ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర నిర్వహించిన స్థానంలో సైబరాబాద్ కమిషనర్ గా నియమించారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ వి. రవిందర్ ను పదోన్నతిపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నియమించారు.
ప్రస్తుతం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ పదోన్నతిపై అదే ఏసీబీలో అదనపు డైరెక్టర్ పోస్టులో నియమించారు. గ్రేహౌండ్స్ కమాండర్ గా పనిచేస్తున్న తరుణ జోషిని అక్కడి నుంచి మార్చి రాచకొండ జాయింట్ కమిషనర్ గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బివ.నవీన్ కుమార్ తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా నియమించారు.
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
Published Thu, Mar 23 2017 10:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement