‘రెడ్‌ మి నోట్‌ 4’ కొత్త వేరియంట్‌

‘రెడ్‌ మి నోట్‌ 4’ కొత్త వేరియంట్‌


సాక్షి, న్యూడిల్లీ: షావోమి రెడ్‌మినోట్‌ 4 లోకొత్త వేరియంట్‌ను  లాంచ్‌ చేసింది. తన తాజా స్మార్ట్‌పోన్‌ నోట్‌ 4   బ్లూ వేరియంట్‌ను ఇండియన్‌ మార్కోట్లో  ప్రారంభించింది. ఇది  సోమవారం మధ్యాహ్నం 12నుంచి ఎం.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ  హ్యాండ్ సెట్ 4జీబీ/ 64జీబీ స్టోరేజ్‌  కాన్‌ఫిగరేషన్‌ లో మాత్రమే లభ్యం కానుంది. 'వేక్ లేక్' ప్రాజెక్టు భాగంగా ప్రారంభించినట్టు కంపెనీ ప్ర కటించింది దీని ధర రూ. 12,999లు.



బెంగళూరులో తీవ్ర కాలుష్యానికి గురవుతున్నచెరువుల పునరుద్ధరణకు మద్దతుగా ఈ లేక్‌ బ్లూ వేరియంట్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు  షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ప్రకటించారు. గత దశాబ్దంలో  బెంగళూరు ప్రజలు  నీటి వనరుల కోసం తీవ్రమైన కష్టాలను  ఎదుర్కొంటున్నారనీ  ఈ  నేపథ్యంలో   బెంగళూరు మున్సిపాలిటీ  ఆధ్వర్యంలోని స్వచ్‌ భారత్ అభియాన్   ప్రాజెక్టుకు మద్దతుగా దీన్ని లాంచ్‌ చేసినట్టు చెప్పారు.



రెడ్‌ మి నోట్‌ 4 లేక్‌ బ్లూ వేరియంట్‌

5.5-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఐపిఎస్ డిస్‌ప్లే

1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్‌ ,  2.5 డి కర్వ్‌డ్‌ గాస్ల్‌

స్నాప్‌డ్రాగన్ 625

4జీబీ ర్యామ్‌,

64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

మైక్రో ఎస్‌డీ కార్డ్ తో ఎక్స్‌పాండబుల్‌ మెమొరీ

13-మెగాపిక్సెల్  రియర్‌ కెమెరా

5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

4100ఎంఏహెచ్‌  బ్యాటరీ

Read latest Technology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top