-
రెడ్మి నోట్ 4 ధర తగ్గింది..
షావోమికి చెందిన హాట్కేకులా అమ్ముడుపోతున్న రెడ్మి నోట్ 4 ధర శాశ్వతంగా తగ్గింది. భారత్లో ఈ స్మార్ట్ఫోన్ ధరను వెయ్యి రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రెడ్ నోట్4 ధర భారత్లో రూ.9999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా అదినేత మను కుమార్ జైన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. '' భారత్లో నెంబర్ 1 అమ్మకపు స్మార్ట్ఫోన్గా ఉన్న రెడ్మి నోట్ 4 ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు మేము ప్రకటిస్తున్నాం'' అని జైన్ ట్వీట్ చేశారు. రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ధర తగ్గింపు అనంతరం 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్బోర్డు స్టోరేజ్ ధర 11,999 రూపాయలు. ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్ రెండింట్లోనూ ఈ ధర తగ్గింపు ఉండనుంది. ఈ ధర తగ్గింపుతో మోటో జీ5, నోకియా 5, శాంసంగ్ గెలాక్సీ జే7 మోడల్స్కు ఇది గట్టి పోటీగా నిలువనుంది. ఫ్లిప్కార్ట్ ఆఫర్లు.. ఈ ధర తగ్గింపుకు అదనంగా, పాత మోడల్స్ను ఎక్స్చేంజ్ చేసి దీన్ని కొనుగోలు చేస్తే రూ.11,000 తగ్గింపు లభించనుంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్మి నోట్ 4 స్పెషిఫికేషన్లు.. 5.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే 2.5 కర్వ్డ్ గ్లాస్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ఎస్ఓసీ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటు -
‘రెడ్ మి నోట్ 4’ కొత్త వేరియంట్
సాక్షి, న్యూడిల్లీ: షావోమి రెడ్మినోట్ 4 లోకొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. తన తాజా స్మార్ట్పోన్ నోట్ 4 బ్లూ వేరియంట్ను ఇండియన్ మార్కోట్లో ప్రారంభించింది. ఇది సోమవారం మధ్యాహ్నం 12నుంచి ఎం.కామ్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ హ్యాండ్ సెట్ 4జీబీ/ 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో మాత్రమే లభ్యం కానుంది. 'వేక్ లేక్' ప్రాజెక్టు భాగంగా ప్రారంభించినట్టు కంపెనీ ప్ర కటించింది దీని ధర రూ. 12,999లు. బెంగళూరులో తీవ్ర కాలుష్యానికి గురవుతున్నచెరువుల పునరుద్ధరణకు మద్దతుగా ఈ లేక్ బ్లూ వేరియంట్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ప్రకటించారు. గత దశాబ్దంలో బెంగళూరు ప్రజలు నీటి వనరుల కోసం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారనీ ఈ నేపథ్యంలో బెంగళూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని స్వచ్ భారత్ అభియాన్ ప్రాజెక్టుకు మద్దతుగా దీన్ని లాంచ్ చేసినట్టు చెప్పారు. రెడ్ మి నోట్ 4 లేక్ బ్లూ వేరియంట్ 5.5-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపిఎస్ డిస్ప్లే 1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్ , 2.5 డి కర్వ్డ్ గాస్ల్ స్నాప్డ్రాగన్ 625 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ తో ఎక్స్పాండబుల్ మెమొరీ 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4100ఎంఏహెచ్ బ్యాటరీ 'Lake blue' edition of India's #1 selling smartphone goes on sale at noon on https://t.co/cwYEXdVQIo, @Flipkart, Mi Home & offline partners! pic.twitter.com/s9OQ29W3DL — Redmi India (@RedmiIndia) September 4, 2017 -
మళ్లీ పేలిన రెడ్మీ నోట్ 4
అచ్యుతాపురం (యలమంచిలి) : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రెడ్మీ నోట్-4 కాలిన ఘటన మరవకముందే విశాఖ జిల్లాలోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చార్జింగ్ పెట్టిన రెడ్మి నోట్-4 మొబైల్ పేలిపోయింది. జిల్లాలోని రామన్నపాలెంలో నిన్న (గురువారం) ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన గంధం ధర్మిరెడ్డి సాయి తన రెడ్మి నోట్-4 సెల్ ఫోన్కు చార్జింగ్ పెట్టి, చార్జింగ్తో ఉన్న ఫోన్తో కాసేపు మాట్లాడి బయటకు వెళ్లాడు. అయిదు నిమిషాల తర్వాత పెద్ద శబ్దం రావడంతో వచ్చి చూడగా సెల్ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ధర్మిరెడ్డి సాయి ఈ ఫోన్ను రెండు నెలల క్రితమే కొనుగోలు చేశాడు. సంబంధిత వార్తలు : కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు! అందుకే ‘నోట్-4’ కాలింది: షావోమి -
రూ.999కే రెడ్మి నోట్ 4
షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్గా పేరొందిన రెడ్మి నోట్ 4 నేడు (బుధవారం) ఫ్లిప్కార్ట్లో విక్రయానికి రానుంది. ''బిగ్ రెడ్మి నోట్ 4 సేల్'' కింద ఈ ఫోన్ను అత్యంత తక్కువ ధర 999 రూపాయలకే ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతోంది. ఈ సేల్, ఫ్లాష్ సేల్లకు భిన్నమైంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎక్స్చేంజ్ డీల్స్, ఈఎంఐ సౌకర్యాలను, బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు షావోమి ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ 2పై 500 రూపాయల డిస్కౌంట్ను అందిస్తోంది. ఫ్లిప్కార్ట్తో పాటు ఎంఐ.కామ్లోనూ నేడు రెడ్మి నోట్4 అమ్మకానికి వస్తోంది. బిగ్ రెడ్మి నోట్ 4 సేల్లో భాగంగా అన్ని వేరియంట్లపైనా.. రూ.249 బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలుచేసిన 6-8 నెలల్లో ఎక్స్చేంజ్ చేస్తే 40 శాతం వాల్యును తిరిగి వెనక్కి ఇచ్చేయనుంది. అంతేకాక పాత స్మార్ట్ఫోన్లతో ఈ ఫోన్ను ఎక్స్చేంజ్లో కొంటే అతి తక్కువ ధరకు రూ.999కే కస్టమర్లకు అందించనుంది. అంటే దాదాపు రూ.12వేల మేర ధర తగ్గుతోంది. ప్రతి రెడ్మి నోట్ 4 కొనుగోలుపై అదనంగా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2కు 500 రూపాయల డిస్కౌంట్ను లభించనుంది. కాగ, ఇటీవలే ఫ్లిప్కార్ట్ తన సైటులో ఆండ్రాయిడ్ 7.0 నోగట్ అప్డేట్తో కూడిన రెడ్మి నోట్ 4ను లిస్టు చేసింది. ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు... 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్... ధర రూ.9999 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్..... ధర రూ.10,999 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్..... ధర రూ.12,999 డ్యూయల్ సిమ్(మైక్రో+నానో) 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 625 ఎస్ఓసీ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 4జీబీ వాయిస్ఓవర్ ఎల్టీఈ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోట్7 మాదిరిగా.. రెడ్మి నోట్4 బ్లాస్ట్
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల పేలుడు ఘటనలు ఇంకా పూర్తిగా మరవనలేదు. తాజాగా మరో ఫేమస్ కంపెనీ స్మార్ట్ఫోన్ కూడా పేలిపోయింది. బెంగళూరులోని ఓ షాపులో షావోమి రెడ్మి నోట్4కు పేలుడు ప్రమాదం సంభవించింది. కస్టమర్కు చెందిన రెడ్మి నోట్ 4 ఫోన్లో షాప్కీపర్ సిమ్ను ఇన్సర్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఒక్కసారిగా ఈ పేలుడు ప్రమాదం సంభవించడంతో ఫోనంతా కాలిపోయింది. అయితే రెడ్మి నోట్ 4 పేలిన సమయంలో ఆ ఫోన్ ఛార్జింగ్లో కానీ లేదా మరే ఇతర యాక్ససరీస్ను కానీ దానికి కనెక్ట్ చేయలేదు. రిటైలర్ దాన్ని హ్యాండిల్ చేస్తున్న క్రమంలోనే మంటల సంభవించాయి. చాలా కేసుల్లో హ్యాండ్సెట్కు ఛార్జింగ్ పెట్టి ఉన్న సమయంలో బ్యాటరీ ఓవర్హీట్ అయి, పేలుడు ఘటనలు జరిగేవి. కానీ ఇలా పేలుడు ఘటన జరగడం చాలా అరుదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన షావోమి కంపెనీ.. తమకు వినియోగదారుడి భద్రతే అత్యంత ముఖ్యమని, ఈ విషయంపై వినియోగదారుడిని సంప్రదించి విచారణ చేపడతామని చెప్పింది. ఆ ఫోన్కు బదులు మరో షావోమి రెడ్మి నోట్ 4 స్మార్ట్ఫోన్ను కస్టమర్కి అందించింది. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదని షావోమి తెలిపింది. ఒకవేళ ఫోన్ను మాట్లాడుతున్న క్రమంలో పేలుడు సంభవిస్తే, తీవ్రమైన గాయాలే అయ్యేవని, ఇది చాలా అదృష్టమని తెలిపింది. అంతకముందు గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలతో శాంసంగ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఫోన్ తరుచు పేలుడు ఘటనలకు ప్రభావితం కావడంతో, శాంసంగ్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఓ వైపు కంపెనీ రెవెన్యూలు, మరోవైపు కంపెనీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు ఘటనలు అతిపెద్ద స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగులుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో షావోమి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
Advertisement