కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే.. | Apples new iPad with 9.7-inch display now up for pre-order on Flipkart | Sakshi
Sakshi News home page

కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే..

Apr 8 2017 4:31 PM | Updated on Aug 20 2018 3:07 PM

కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే.. - Sakshi

కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే..

ఐప్యాడ్ ఏయిర్ 2ను రిప్లేస్ చేస్తూ ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐప్యాడ్ (2017) ఇప్పుడు భారత్ లోనూ దొరుకుతోంది.

ఐప్యాడ్ ఏయిర్ 2ను రిప్లేస్ చేస్తూ ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐప్యాడ్ (2017) ఇప్పుడు భారత్ లోనూ దొరుకుతోంది. మార్చి చివర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మోడల్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ ఈ-కామర్స్ దిగ్గజ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా స్వీకరిస్తోంది. శుక్రవారం నుంచి ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. ఆపిల్ ముందస్తు నిర్ణయించిన ధర రూ.28,900కే ఈ 32జీబీ వై-ఫై మోడల్ ను ప్రీ-ఆర్డర్ల ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. 32జీబీ వై-ఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ను కంపెనీ ఇంకా లిస్టు చేయలేదు. వై-ఫై ప్లస్ మోడల్ ధర రూ.39,900గా ఉంది.
 
3.1 మిలియన్ కు పైగా పిక్సెల్స్ తో 9.7 అంగుళాల రెటీనా డిస్ప్లేను ఈ ఐప్యాడ్ కలిగి ఉంది. థిన్ అల్యూమినియం యూనిబాడీ, ఆపిల్ ఏ9 చిప్, వై-ఫైపై 10 గంటలు పాటు పనిచేయగల బ్యాటరీ సామర్థ్యం, 8ఎంపీ రియర్ కెమెరా, 1.2 ఎంపీ ఫ్రంట్ ఫేస్ టైమ్ కెమెరా దీని ప్రత్యేకతలు. దీనికోసం స్పెషల్ గా 1.3 మిలియన్ పైగా యాప్స్ ను కంపెనీ డిజైన్ చేసింది. ఈ ఐప్యాడ్ ప్రపంచంలో అత్యంత పాపులర్ టాబ్లెట్ అని, మూవీలు, టీవీ చూసుకునేందుకు వీలుగా పెద్ద స్క్రీన్ సైజుతో దీన్ని తీసుకొచ్చామని  వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిలర్ చెప్పారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement