వేరు కాపురం పెట్టలేదని.. | women suicide attempt in nalgonda | Sakshi
Sakshi News home page

వేరు కాపురం పెట్టలేదని..

Nov 8 2016 12:48 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది.

నల్గొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కంభంపాటి నాగరాజు, సులోచన (25) భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వేరు కాపురం పెట్టాలనే విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం భర్త బయటకు వెళ్లిన సందర్భంలో సులోచన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన అత్తమామలు మంటలార్పి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement