వేరు కాపురం పెట్టలేదని.. | women suicide attempt in nalgonda | Sakshi
Sakshi News home page

వేరు కాపురం పెట్టలేదని..

Nov 8 2016 12:48 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది.

నల్గొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. కంభంపాటి నాగరాజు, సులోచన (25) భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వేరు కాపురం పెట్టాలనే విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం భర్త బయటకు వెళ్లిన సందర్భంలో సులోచన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన అత్తమామలు మంటలార్పి సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 50 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement