భర్తపై మారణాయుధాలతో భార్యలు దాడి | Wife's Attempts to Murder Husband in Karnataka | Sakshi
Sakshi News home page

భర్తపై మారణాయుధాలతో భార్యలు దాడి

Jul 2 2014 8:18 AM | Updated on Aug 21 2018 5:46 PM

భర్తపై మారణాయుధాలతో భార్యలు దాడి - Sakshi

భర్తపై మారణాయుధాలతో భార్యలు దాడి

భూ వివాదం కారణంగా కట్టుకున్న భర్తపైనే ఇద్దరు భార్యలు మారణాయుధాలతో విరుచుకుపడిన సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని కుక్కలహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

దొడ్డబళ్లాపురం : భూ వివాదం కారణంగా కట్టుకున్న భర్తపైనే ఇద్దరు భార్యలు మారణాయుధాలతో విరుచుకుపడిన సంఘటన కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం తాలూకాలోని కుక్కలహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు నారాయణస్వామి (40) ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... కుక్కలహళ్లికి చెందిన నారాయణస్వామికి ఇద్దరు భార్యలు, యశోదమ్మ, గంగమ్మ. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి విషయంలో నారాయణస్వామి, అతడి అన్న నరసయ్యలకు వివాదం ఉంది.

సోమవారం గ్రామ పెద్దలు భూ వివాదాన్ని పరిష్కరించారు. ఈ పరిష్కారం నారాయణస్వామి భార్యలకు నచ్చలేదు. పెద్దల తీర్పును అంగీకరించవద్దని భర్తకు ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యశోదమ్మ, గంగమ్మ మంగళవారం తెల్లవారు జామున నారాయణ స్వామితో గొడవపడి కళ్లల్లో కారం కొట్టి కొడవలితో దాడి చేశారు.

ప్రతిఘటించే ప్రయత్నంలో నారాయణస్వామి చేతి వేళ్లు తెగిపోవడంతో పాటు ఛాతీపై కొడవలి దెబ్బలు పడ్డాయి. మర్మాంగంపై కూడా కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అక్కడి నుంచి తప్పించుకుని అన్న నరసయ్య ఇంటి వద్దకు చేరుకుని స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం నరసయ్య బాధితుడిని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి హొసహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు.

హత్యాయత్నం, భర్తపై హత్యాయత్నం, భార్యలు, కుక్కలహళ్లి, పోలీసులు, attempt to Murder, husband, wife, kukkalahalli, police

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement