ఆటో - లారీ ఢీ: ఇద్దరు మృతి | two killed in road accident in warangal district | Sakshi
Sakshi News home page

ఆటో - లారీ ఢీ: ఇద్దరు మృతి

Oct 5 2016 8:05 AM | Updated on Aug 30 2018 4:10 PM

హన్మకొండ మండలం మామునూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ట్రాలీ ఆటో - లారీ ఢీకొన్నాయి.

వరంగల్ : హన్మకొండ మండలం మామునూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున ట్రాలీ ఆటో - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement