సాక్షి, ముంబై: నగరంలో మరో రెండు జోన్లను ఏర్పాటు చేయడానికి ముంబై పోలీసులు యోచిస్తున్నారు. నగరంలో జనాభా పెరగడంతో నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకొని మరో రెండు జోన్ల ఏర్పాటుకు పూనుకున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 13 పోలీస్ జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్కు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బాధ్యత వహిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసిన వెంటనే అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిపంచనున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ధనుంజయ్ కమలాకర్ తెలిపారు. ఉత్తర, తూర్పు శివారు ప్రాంతాల్లో ఈ జోన్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు.
ఇక్కడ జనాభాతోపాటు నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయన తెలిపారు. అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఉత్తర శివారు ప్రాంతాల్లోని 11వ, 12వ జోన్లు గోరేగావ్ నుంచి దహిసర్ వరకు కవర్ చేస్తాయి. అదేవిధంగా తూర్పు శివారు ప్రాంతాల్లోని ఆరు, ఏడవ జోన్లు ఘాట్కోపర్ నుంచి ములుండ్ వరకు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా చెంబూర్ నుంచి ములుండ్ వరకు వీటి పరిధి ఉంటుందని కమలాకర్ వెల్లడించారు. కొత్త జోన్ల పరిధిలోకి ఏఏ స్టేషన్లు వస్తాయో త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.
పెరిగిన అక్రమ ఆయుధాల రవాణా..
ముంబై నగరం అక్రమ ఆయుధాలకు అడ్డాగా మారింది. ఈ నేపథ్యంలో నేర శాఖ, ముంబై పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ మంచి ఫలితాలను సాధించింది. ఈ ఏడాది 257 రివాల్వర్లు, పిస్టళ్లు, 715 బుల్లెట్లు హస్తగతం చేసుకున్నారు. 1990 దశకంలో ముంబైని అండర్ వరల్డ్ డాన్లు గడగడలాడించారు. ఏకే-47 లాంటి అత్యాధునిక మెషిన్ గన్స్ వంటి వినియోగించేవారు. ఆ రోజుల్లో నగరంలో ఏదో ఒక ప్రాంతంలో గ్యాంగ్స్టర్ల మధ్య కాల్పులు సర్వసాధారణంగా కనిపించేవి.
కాగా, పోలీస్ శాఖ కఠినచర్యలు తీసుకోవడంతో అనంతర కాలంలో వారంతా కనుమరుగయ్యారు. మళ్లీ ఇప్పుడు చిన్న చిన్న రౌడీ మూకలు నగరంలో దోపిడీలకు పాల్పడటం మొదలుపెట్టారు. దీనికోసం వారు బయట రాష్ట్రాల నుంచి ఆధునాతన ఆయుధాలను తీసుకువచ్చి ఇక్కడ తమ కార్యకలాపాలను చేపడుతున్నారు. ఇదిలా ఉండగా, వీరిని నియంత్రించేందుకు పోలీస్శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఆయుధాలతోపాటు సుమారు 300 మంది నేరస్తులు పట్టుబడ్డారు. వీరిపై మొత్తం 292 కేసులు నమోదు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ నేరాల సంఖ్య రెట్టింపు ఉందని పోలీసులు వెల్లడించారు.
నగరానికి మరో రెండు జోన్లు!
Published Sun, Nov 30 2014 10:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement