► జల్లికట్టు తరహాతో భయపెట్టిన అన్నదాతలు
► మెరీనాలో మోహరించిన పోలీసులు
► రెండు నెలల్లో డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం హామీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నదాతలను ఆదుకోకుంటే జల్లికట్టు తరహా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని భయపెట్టారు. నగరం దిగ్బంధం అయిపోయింది. మెరీనా బీచ్ పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దిగివచ్చిన ప్రభుత్వం రెండునెలల గడువు కోరడంతో రైతన్నలు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం దక్షిణభారత నదుల అనుసంధానం సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నాయకత్వంలో ఢిల్లీలో పోరాటం చేశారు.
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీకి వెళ్లి సంప్రదింపులు జరిపి డిమాం డ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఢిల్లీలో ఆందోళన విరమించారు. అయితే సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మళ్లీ ఆందోళనబాట పట్టారు. మధ్యప్రదేశ్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంజలి ఘటించడానికి, రైతులు కోర్కెల సాధన కోసం చెన్నై చేపాక్లోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద శుక్రవారం నిరవధిక ఆందోళన ప్రారంభించారు. కాల్పుల్లో మృతి చెందిన రైతుకు తొలిరోజున అంజలి ఘటించేలా ఆం దోళన జరిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి చెన్నైలోని పలు ప్రాంతాల నుంచి వం దల సంఖ్యలో యువకులు రైతుల ఆందోళనా శిబిరానికి చేరుకున్నారు.
ఇంకా మరికొందరు ద్విచక్రవాహనాల్లో బయలుదేరగా నగరంలోని పలుచోట్ల పోలీసులు నిలిపివేసి వెనక్కు పంపారు. అ తరువాత రైతుల అందోళనా శిబిరం ఉన్న చేపాక్ ప్రభుత్వ అతిథిగృహం వైపు వెళ్లే అన్ని మార్గాలకు బారికేడ్లను అడ్డుపెట్టి ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఆందోళనా శిబిరం వైపు వాహనాలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. వంద మందికి పైగా పోలీసులు ఆ పరిసరాల్లో బందోబస్తుగా నిలిచారు. వాలాజా రోడ్డులో వాహనాలను అనుమతించకుండా దారిమళ్లించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్యోగాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అన్నాశాలై, కామరాజర్శాలై ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి.
రైతుల ఆందోళనకు పెద్ద సంఖ్యలో యువకులు తరలిరావడంతో మరో జల్లికట్టు ఉద్యమంలా మారుతుందని కంగారుపడిన పోలీసు యంత్రాంగం మెరీనా బీచ్ వద్ద గట్టి బందోబస్తు పెట్టింది. రెండోరోజు ఆందోళన సందర్భంగా అర్ధనగ్నంగా శిబిరంలో కూర్చున్నారు. చేపాక్ స్టేడియం సమీపంలో కార్పొరేషన్ పార్కులోని టాయిలెట్ల వినియోగానికి అనుమతించారు. పోలీసులే రైతులకు ఆహార సదుపాయాన్ని కల్పించారు. కాగా, చెన్నై సచివాలయంలో సీఎంతో చర్చలకు రైతు ప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. అయ్యాకన్ను నేతృత్వంలో ఐదు గురు రైతులు సీఎంతో చర్చలు జరిపారు. వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, చెరకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్లను సీఎం ముందుంచారు.
ముఖ్యమంత్రితో చర్చించిన ఆంశాలను రైతులకు వివరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సచివాలయంలో మీడియాకు అయ్యాకన్ను చెప్పాడు. సీఎంను కలిసిన అనంతరం అయ్యాకన్ను నేరుగా ఆందోళనా శిబిరానికి వచ్చి సీఎంతో చర్చించిన ఆంశాలను వివరించాడు. పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేద్దామని కోరగా అందరూ చేతులు ఊపుతూ తమ ఆమోదాన్ని తెలిపారు. ఆ తరువాత ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆయ్యాకన్ను మీడియా వద్ద ప్రకటించాడు. రెండు నెలల్లోగా తమ డిమాండ్లను నెరవేరుస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్లాస్టిక్ బియ్యం అంశాన్ని ప్రస్తావించగా, తమిళనాడులోకి వాటిని రానివ్వమని ఆర్థికమంత్రి జయకుమార్ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
అర్ధనగ్నంగానే సీఎం వద్దకు:
సీఎంతో చర్చలకు వచ్చేవారు చొక్కాలు ధరించి రావాలని పోలీసులు కోరారు. దీంతో ఆందోళనా శిబిరాల్లోని వారికి చొక్కాలు తెచ్చివ్వాలని బందోబస్తులో ఉన్న పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే అయ్యాకన్ను సహా మిగిలిన రైతు ప్రతినిధులు చొక్కా వేసుకునేది లేదని భీష్మించుకోవడంతో అర్ధనగ్నంగానే సీఎం వద్దకు అనుమతించక తప్పలేదు
తాత్కాలిక విరమణ
Published Sun, Jun 11 2017 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement