ప్రత్యేక ప్రతిభావంతులతో వ్యవహరించాల్సిన విధి విధానాల్ని త్వరితగతిన రూపొందించి, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగు వారాల గడువును ఇస్తూ, ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
సాక్షి, చెన్నై:అంధులు, వికలాంగులు, చెవిటి, మూగ వంటి అంగ వైకల్యం కలిగిన వారందరినీ ప్రత్యేక ప్రతిభావంతులుగా పరిగణిస్తున్నారు. ఇటీవల వీరు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షల రూపంలో తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తూ ఇక్కట్లకు గురవుతున్నారు. ఆందోళనలు చేసే క్రమంలో వీరిని పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదమవుతోంది. నెల న్నర క్రితం చెన్నైలో రోజుకో చోట చొప్పున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించిన ప్రత్యేక ప్రతిభావంతులపై పోలీసులు కన్నెర్ర చేశారు. ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం కల్గించే రీతిలో వ్యవహరిస్తున్న ఈ ప్రత్యేక ప్రతిభావంతుల్ని అరెస్టు చేసి, నగర శివారులో వదిలిపెట్టి వచ్చారు. అయితే, చూపు లేని వాళ్లు, నడవ లేని వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వ్యవ హారం తన దృష్టికి రావడంతో న్యాయవాది నజీరుల్లా మద్రాసు హైకోర్టుకు ఓ లేఖ రాశారు. పోలీసుల చర్యలతో ప్రత్యేక ప్రతిభావంతులు పడ్డ అష్టకష్టాలను వివరించారు. ఆయన లేఖను పిటిషన్గా భావించిన హైకోర్టు కేసు విచారణకు ఆదేశించింది. వికలాంగుల్ని అరెస్టు చేసే క్రమంలో వారితో ఎలా వ్యవహరించాలో అన్న అంశంపై విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
అమల్లో విధి విధానాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని మొదటి బెంచ్ ముందు గురువారం కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరుపున కొన్ని విధానాల్ని రూపొందించి బెంచ్ ముందు ఉంచారు. అయితే, ఆ విధానాల అమలు కేవలం చెన్నైకు పరిమితం చేశారంటూ వికలాంగుల సంఘాలు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న బెంచ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ప్రతిభావంతులు తమ డిమాండ్లు, హక్కుల సాధన కోసం ఆందోళనలకు దిగిన పక్షంలో, వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలోకి తరలించడం కన్నా, వారి చిరునామా తదితర వివరాల్ని సేకరించి సమీపంలోని బస్టాండ్కు తీసుకెళ్లి బస్సు ఎక్కించి పంపించాలని సూచించారు. మరికొన్ని విధి విధానాలను త్వరితగతిన రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులతో సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసి, డిమాండ్లను, హక్కుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే రీతిలో ఆ కమిటీలకు మార్గదర్శకాల్ని నిర్దేశించాలని సూచించారు. నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో విధి విధానాల్ని రూపొందించి అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అమలు చేసిన విధి విధానాల్ని పిటిషన్ రూపంలో కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
‘ప్రత్యేక’ విధానాలు అమలు చేయండి
Published Fri, Jan 30 2015 12:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement