ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిపై తనయుడు దాడిచేసిన సంఘటన అక్కంపేట గ్రామంలో చోటుచేసుకుంది.
తల్లిపై తనయుడి దాడి: పరిస్థితి విషమం
Oct 21 2016 7:10 PM | Updated on Sep 2 2018 4:37 PM
ఏలూరు: జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిపై తనయుడు దాడిచేసిన సంఘటన శుక్రవారం అక్కంపేట గ్రామంలో చోటుచేసుకుంది. పులపాకుల వెంకటలక్ష్మిపై ఆమె కుమారుడు రామకృష్ణ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement