కరుప్పస్వామి ఆలయంలో విషాద ఘటన... | Seven Devotees Died In Stampede At Trichy Temple | Sakshi
Sakshi News home page

ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు భక్తులు మృతి

Apr 21 2019 6:11 PM | Updated on Apr 21 2019 7:11 PM

Seven Devotees Died In Stampede At Trichy Temple - Sakshi

పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో

చెన్నై: తమిళనాడు తిరుచ్చి సమీపంలోని ముత్యంపాలయంలో విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలోని కరుప్పస్వామి ఆయలంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని తురైయూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కురుప్పస్వామి ఆలయంలో ప్రతి ఏడాది చైత్రమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా హుండీలోని చిల్లరను పంచడం(పడికాసు) ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పూజరి భక్తులకు చిల్లర నాణేలు పంచుతున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement