టీడీపీ నేతలకు భద్రత పెంపు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు భద్రత పెంపు

Published Fri, Oct 28 2016 4:49 AM

టీడీపీ నేతలకు భద్రత పెంపు - Sakshi

గుంటూరు: ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ‍్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను కేటాయించింది.

ఏపీ మంత్రులు ప్రత్తి పాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబుకు భద్రతను పెంచారు. మంత్రుల ఇళ్ల దగ్గర కూడా అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై అధికారులు నిఘాను పెంచారు. కాగా నల్లమలలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలిన నేప‌థ్యంలో పోలీస్ యంత్రాంగం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎటువంటి ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా ఏవోబీలో ప్ర‌త్యేక బ‌ల‌గాల‌ను రంగంలో దింపుతున్నారు.
 

Advertisement
Advertisement