నేటి నుంచి వర్షాలు పెరిగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కోస్తాంధ్రకు వర్ష సూచన
Oct 6 2016 11:04 AM | Updated on Sep 4 2017 4:25 PM
విశాఖ : రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు పెరిగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవర్తనం ఆవరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
Advertisement
Advertisement