అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు విరివిగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు జిల్లా జోలార్పేటలో
వేలూరు:అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు విరివిగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు జిల్లా జోలార్పేటలో తాళికి బంగారం పథకం కింద 1,172 మంది లబ్ధిదారులకు రూ.5.44 కోట్ల విలువ చేసే నగదు, బంగారాన్ని మంత్రి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత అన్నాడీఎంకేకు దక్కిందన్నారు. తమ ప్రభుత్వంలో పురిటి బిడ్డ నుంచి శ్మశానానికి వెళ్లే వరకు పలు పథకాలను అందజేస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాళికి బంగారం పథకం కింద రాష్ట్రంలోని పేద కుటుంబాలకు నాలుగు గ్రాముల బంగారం, నగదు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యావేత్తలుగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. విడతల వారిగా అన్ని మారుమూల ప్రాంతాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు సంపాదనలో కొంత బ్యాంక్లో పొదుపు చేసి అభివృద్ధి చెందాలన్నారు. కలెక్టర్ నందగోపాల్, పార్లమెంట్ సభ్యులు సెంగొట్టవన్, ఎమ్మెల్యేలు కేజీ రమేష్, కోవై సంపత్కుమార్, జెడ్పీ చైర్మన్ లీలా సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్మన్ వాసుమది శ్రీనివాసన్, అన్నాడీఎంకే నాయకులు, అధికారులు పాల్గొన్నారు.