నాటుసారా స్థావరాలపై పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేసి నాటుసారాను ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
Dec 20 2016 3:46 PM | Updated on Aug 21 2018 6:22 PM
మల్యాల: నాటుసారా స్థావరాలపై పోలీసులు మంగళవారం ఉదయం దాడి చేసి నాటుసారాను ధ్వంసం చేశారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గుట్టల సమీపంలో నాటుసారా తయారుచేస్తున్నారనే పక్కా సమాచారం మేరకు దాడిచేశారు. బూమిలో పాతిపెట్టిన డబ్బాల్లో నిల్వచేసిన సుమారు 200 లీటర్ల నాటుసారాతో పాటు, పాత్రలను ధ్వంసం చేశారు. ఈ మేరకు నాటుసారా కాస్తున్న లక్ష్మయ్యపై కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ చెప్పారు.
Advertisement
Advertisement