సెప్టెంబర్ 4 వరకు పార్లమెంటు! | Parliament until September 4 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 4 వరకు పార్లమెంటు!

Aug 23 2013 1:14 AM | Updated on Oct 2 2018 8:49 PM

పార్లమెంటు సమావేశాలను సెప్టెంబర్ 4 వరకు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

 న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను సెప్టెంబర్ 4 వరకు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉభయ సభలు తరచు వాయిదా పడుతున్న కారణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లు చర్చకు నోచుకోలేకపోతోంది. ఈ బిల్లుపై చర్చ చేపట్టేందుకు వీలుగా సమావేశాలను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని ఉన్నతస్థాయి నేతలు అంగీకరిస్తున్నారు. జేడీ(యూ) నేత శరద్ యాదవ్ కూడా పార్లమెంటు సమావేశాల పొడిగింపు అంశంపై ఆ పార్టీ బీహార్ యూనిట్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ఇదిలావుంటే, ప్రధాని మన్మోహన్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌లు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌తో భేటీ కావడం సభ పొడిగిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement