నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలోని పురాతన శివాలయంలో చోరీ జరిగింది.
పంచలోహ విగ్రహాలు చోరీ
Nov 3 2016 3:54 PM | Updated on Aug 30 2018 5:27 PM
దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలోని పురాతన శివాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని పంచలోహ నిర్మిత శివపార్వతుల విగ్రహాలను బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement