వరంగల్ జిల్లా జనగామ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్టీఏ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్య
Sep 9 2016 11:03 AM | Updated on Aug 29 2018 8:38 PM
జనగామ: వరంగల్ జిల్లా జనగామ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా నివాసముంటున్న రమేష్(38) శుక్రవారం ఉదయం ఆర్టీఏ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలకు తోడు కుటుంబ కలహాలు ఎక్కువవడంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement