ఆమె ఇద్దరి పిల్లల తల్లి. భర్త, పిల్లలతో వారి సంసరనావ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతోంది.
= ప్రేమించాలని ఫోన్లో వేధింపులు
= వివాహిత బలవన్మరణం
కృష్ణరాజపురం : ఆమె ఇద్దరి పిల్లల తల్లి. భర్త, పిల్లలతో వారి సంసరనావ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతోంది. ఊహించని విధంగా గుర్తు తెలియని వ్యక్తి ప్రేమ పేరుతో వేధింపులు మొదలు పెట్టి చిచ్చు రేపాడు. తన మనో వేదనను బయటకు చెప్పుకోలేక చివరకు ఆ వివాహిత ఉరికి వేలాడింది. ఈ ఘటన మహాదేవుపుర పోలీస్స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి అన్న పృధ్విరాజ్ కథనం మేరకు.. సరస్వతి నగర్కు చెందిన దీపకు పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా, కదిరికి చెందిన మెకానిక్ రవికుమార్తో వివాహమైంది. దంపతులు సరస్వతి నగరంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి సమీపంలోని బ్యూటీ పార్లర్లో దీపా పని చేస్తుండగా భర్త కూడా అదే ప్రాంతంలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి దీపా మొబైల్కు ఫోన్ చేసి తనను ప్రేమించాలని వేధించేవాడు. తనకు వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇలా వేధించడం తగదని ఆమె మందలించింది.
అయినా వేధింపులు ఆగలేదు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక మనో వేదనకు గురైన దీపా మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.