'ఏపీ ప్రభుత్వానిది పరిపాలనా? వ్యాపారమా?' | Kolagatla veerabadhra swamy slams ap govt | Sakshi
Sakshi News home page

'ఏపీ ప్రభుత్వానిది పరిపాలనా? వ్యాపారమా?'

Sep 1 2016 5:58 PM | Updated on Sep 4 2017 11:52 AM

ప్రభుత్వం పరిపాలన చేస్తుందో లేక వ్యాపారం చేస్తుందో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో లేక వ్యాపారం చేస్తుందో అర్థం కావడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. గురువారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకోవడానికే వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement