నడిరోడ్డుపై మంటగలిసిన మానవత్వం | Karnataka Man Stabbed And Beaten, People Film Him, But Don't Help | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై మంటగలిసిన మానవత్వం

Jun 22 2016 6:22 PM | Updated on Sep 4 2017 3:08 AM

నడిరోడ్డుపై మానవత్వం మంటగలిసింది. బస్టాప్ లో నిల్చున్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేస్తున్నా ఒక్కరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు సరి కదా అందరూ వేడుక చూస్తూ తమ సెల్ ఫోన్ లో జరిగిన ఉదంతాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన హృదయ విదారక ఘటన కర్నాటక లోని హసన్ లో చోటు చేసుకుంది.

హసన్: నడిరోడ్డుపై మానవత్వం మంటగలిసింది. బస్టాప్ లో నిల్చున్న  ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేస్తున్నా ఒక్కరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు సరి కదా అందరూ వేడుక చూస్తూ తమ సెల్ ఫోన్ లో జరిగిన ఉదంతాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించిన హృదయ విదారక ఘటన కర్నాటక లోని హసన్ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న సాయంత్రం  ధనుష్ అనే వ్యక్తి బెంగళూరుకు 185 కిలో మీటర్ల దూరంలోని హసన్ లోని  బస్టాప్ సమీపంలో ఒక మహిళతో ఉన్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు  దుర్భాష లాడుతూ అతనిపై దాడి చేశారు. దీంతో ధనుష్ తన సోదరున్ని, ఇద్దరు స్నేహితులను  సాయం చేయమని కేకలు వేయడంతో వారు అక్కడికి చేరుకున్నారు.

 ఇరు వర్గాలు దాదాపు 20 నిమిషాలు రోడ్డుపై కొట్టుకున్నారు.  ఈ దాడిలో ధనుష్ సోదరుడు సుదీప్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ఇంత జరుగుతున్నా ఒక్కరూ వారికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. .జరుగుతున్న ఉదంతాన్ని తమ చరవాణిలో చిత్రీకరించడానికే ప్రయత్రించారు. కేసును నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి  రాహుల్ కుమార్ తెలిపారు.
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement