సాక్షి, చెన్నై :కూడంకులం అణు విద్యుత్ కేంద్రం ఆవరణలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. గోవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనుల్ని ప్రారంభించారు. ఇక, రెండో యూనిట్లో ఉత్పత్తి వేగం పెరగడం విశేషం. తిరునల్వేలి జిల్లా కూడంకులంలో భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతున్న విషయం తెలిసిందే. రెండో యూనిట్లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టినా, కొన్ని సాంకేతిక కారణాలతో తరచూ ఉత్పత్తిని నిలుపుదల చేసి, మరలా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేంద్రం ఆవరణలో రూ. 39 వేల కోట్లతో మూడు, నాలుగో యూనిట్ల ఏర్పాటుకు రెండు దేశాల మధ్య గతంలో ఒప్పందాలు కుదిరాయి. ఆ మేరకు ఆ యూనిట్ల పనులకు తగ్గ చర్యల్ని అణు విద్యుత్ శక్తి బోర్డు వర్గాలు తీసుకున్నాయి.
ఈ పనులకు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. ఎక్కడ అణు వ్యతిరేకుల నుంచి నిరసనలు బయలు దేరుతాయోనన్న ముందస్తు సమాచారంతో ఆ పరిసరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గోవా నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనుల్ని ప్రారంభించారు. ఈ సమయంలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శ్రీకారం చుడుతూ అణు విద్యుత్ కేంద్రం వర్గాలు ముందుకు సాగాయి. ఈసందర్భంగా భారత్, రష్యా శాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్, మోదీలతో మాట్లాడారు. అదే సమయంలో గత కొద్ది రోజులుగా ఆగి ఉన్న రెండో యూనిట్ ద్వారా ఉత్పత్తి వేగాన్ని పెంచుతూ ముందుకు సాగారు.
ఈ విషయంగా కూడంకులం అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ, ఒకటో యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సాగుతున్నదన్నారు. రెండో యూనిట్ ద్వారా తమకు అణు శక్తి కమిషన్ యాభై శాతం మేరకు మాత్రమే ఉత్పత్తికి తగ్గ అనుమతి ఇచ్చి ఉన్నట్టు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆ శాతాన్ని పెంచనున్నారని, ఆ మేరకు పూర్తి స్థాయిలో కొన్ని నెలల వ్యవధిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఆ యూనిట్ ద్వారా దక్కుతుందన్నారు. ప్రస్తుతం, మూడు, నాలుగు యూనిట్ల పనులకు చర్యలు తీసుకున్నామని, పనుల వేగం పెంచనున్నామని వివరించారు. ఈ పనుల్ని 2022 నాటికి ముగించేవిధంగా ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు.
శ్రీకారం..
Published Sun, Oct 16 2016 2:08 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
భారత్ ఆత్మపై బీజేపీ దాడి: రాహుల్గాంధీ
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
తప్పక చదవండి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
- నన్ను చంపాలని చూశారు.. ఇది చంద్రబాబు కుట్రే: ఆర్.కృష్ణయ్య
- Lok Sabha Election 2024: జేడీయూ వర్సెస్ జేడీయూ!
- Lok Sabha Election 2024: నువ్వా నేనా?!
- Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
Advertisement