సమస్యను ఇలా సంధించారు !

Graphics Photos Viral in Social Media On Potholes Karnataka - Sakshi

స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభానికి బాలీవుడ్‌ నటులు

రోడ్డుపై తమిళ నటుడు విజయ్‌ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఫొటో

సోషల్‌ మీడియాలో గ్రాఫిక్స్‌

సమస్య పరిష్కారానికి చిక్క యువత వినూత్న పంథా

బొమ్మనహళ్లి: ఓ సమస్యపై స్పందించడానికి యువత చేసిన వినూత్న ప్రయోగం అందరిని ఆకట్టుకునేలా చేసింది. కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని మూడిగెరె తాలుకాలో ఉన్న కళస పట్టణానికి స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభించడానికి ప్రముఖ నటీనటులు సన్నీలియోన్, దీపికా పదుకోనె వస్తున్నట్లు అక్కడి సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌లలో ఫొటోల గ్రాఫిక్స్‌ వైరల్‌గా మారాయి. అయితే అది నిజం కాదు. ఇక్కడి ప్రజా పనుల శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం వేసిన రోడ్లు ఇటీవల వర్షాలకు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం కోసం ఇలాంటి ప్రయోగం చేపట్టారు. గుంతలు పడిన రోడ్డును ఫొటో తీసుకుని వాటి పక్కనే స్విమ్మింగ్‌పూల్‌ ప్రారంభానికి నటులు సన్నీలియోన్, దీపికా పడుకునె వస్తున్నారని వాటిని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. అంతేకాకుండా ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ కళస పట్టణానికి వచ్చి వినూత్నంగా నిర్మించిన స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఫొటోసైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజాధనం వృథా చేస్తూ నాణ్యతలేని పనులు చేస్తున్నారని, అటు అధికారులకు, కాంట్రాక్టర్లకు యువత చురకలు అంటించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top