చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం | former mp harsha kumar takes on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం

Dec 9 2016 7:29 PM | Updated on Oct 3 2018 7:42 PM

చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం - Sakshi

చంద్రబాబుపై హర్షకుమార్‌ ఆగ్రహం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ నిప్పులు చెరిగారు.

రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పట్టిసీమ విషయంలో చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పట్టి సీమ​కు ఎలాంటి గుర్తింపు లేదని అన్నారు.

నదుల అనుసంధానం తానే చేశానంటూ చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా కల్లబొల్లి మాటలని హర్ష కుమార్‌ చెప్పారు. పట్టి సీమకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ స్పష్టం చేసిందని హర్ష కుమార్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement