మద‍్దతు ధర కోసం రైతుల ధర్నా | farmers dharna for support price | Sakshi
Sakshi News home page

మద‍్దతు ధర కోసం రైతుల ధర్నా

Mar 14 2017 2:04 PM | Updated on Jun 4 2019 5:16 PM

పంటకు మద‍్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఖమ‍్మంలో తెలంగాణ రైతు సంఘం ధర్నా నిర‍్వహించారు.

ఖమ్మం: పండించిన పంటకు మద‍్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఖమ‍్మంలో మంగళవారం తెలంగాణ రైతు సంఘం ధర్నా నిర‍్వహించారు. మిర్చికి క్వింటాలుకు 1500 రూపాయలు, కందులు క్వింటాలుకు 8,000 రూపాయలు, సుబాబుల్‌ టన‍్నుకు 5,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ‍్వాలని, అలాగే మామిడి రైతులకు నష‍్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. అలాగే సాగర్‌ జలాలు ఏప్రిల్‌ 15 వ తేదీ వరకూ ఇవ్వాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement