సాక్షి, న్యూఢిల్లీ:హైకోర్టు విధించిన నిషేధాన్ని ఈ-రిక్షావాలాలు పట్టించుకోవడం లేదు. అవి నగర రహదార్లపై జోరుగా తిరుగుతున్నాయి. చివరి నిమిషంలో గమ్యం చేరుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతుండడంతో ప్రయాణికులు వాటిని విడిచిపెట్టడం లేదు. నిషేధం విధించేముందు ప్రభుత్వం తమకు మరో ప్రత్యామ్నాయాన్ని చూపాలని వారంటున్నారు. గురుగోవింద్ సింగ్ ఇంద్ర ప్రస్థ యూనివర్సిటీ, ద్వారకా సెక్టర్ 14 మెట్రో స్టేషన్, పాలం, రఘునగర్, కరోల్ బాగ్, శక్తినగర్ తదితర ప్రాంతాల్లో ఈ రిక్షాలు ఇప్పటికీ తిరుగుతున్నాయి. హైకోర్టు నిషేధాన్ని ఈ-రిక్షా చోదకులు గానీ, ప్రయాణికులు గానీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆటో రిక్షాల కన్నా ఇవే చౌక అని, అలాగే మామూలు రిక్షా కంటే త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటామని ప్రయానికులు అంటున్నారు. ప్రజారవాణా సదుపాయం లేని మార్గాల్లో వీటి సేవలను ఉపయోగించడం తప్ప తమకు మరో మార్గంలేదని వారంటున్నారు.
తమకు ఉపాధికి ఇదే మార్గమని, అందువల్ల దానిపై నిషేధం విధించినా ఖాతరు చేయడం లేదని ఈ-రిక్షా చోదకులు అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది ఎక్కడ పట్టుకుంటారోననే భయం వెన్నాడుతున్నప్పటికీ కుటుంబ పోషణకకోసం రిసు తీసుకోకతప్పడం లేదని వారంటున్నారు. ఈ భయం కారణంగానే ప్రధాన రహదారుల్లో కాకుండా వీధులకే పరిమితమవుతున్నామనని వారు చెప్పారు. ఈ రిక్షాలవల్ల ఒక దుర్ఘటన జరిగినంత మాత్రాన వాటిపై నిషేధం విధించడం సబబు కాదని వాదిస్తున్నారు. బస్సులు, ఆటోలు, కార్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, మరికి వాటిపై విధించని వీటిపైనే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.ఇదిలాఉండగా ఈ రిక్షాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ వాటి చోదకులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిషేధం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిక్షా చోదకులు నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పశ్చిమ ఢిల్లీ మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా కూడా పాల్గొన్నారు.
నిషేధమున్నా యథేచ్ఛగా!
Published Tue, Aug 26 2014 11:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement