కనకదుర్గ దేవస్థానంలో ముగిసిన దసరా ఉత్సవాలు | dasara celebrations end in vijayawada durga temple | Sakshi
Sakshi News home page

కనకదుర్గ దేవస్థానంలో ముగిసిన దసరా ఉత్సవాలు

Oct 11 2016 12:20 PM | Updated on Jul 29 2019 6:03 PM

బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ముగిశాయి.

విజయవాడ : బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఆలయ పండితులు యజ్ఞ నారాయణశర్మ, శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎ. సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 11 రోజులపాటు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. సాయంత్రం గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం హంసవాహనంపై కృష్ణానదిలో జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement