కనకదుర్గ అమ్మవారిని మంగళవారం శాసనమండలి చైర్మన్ చక్రపాణి దర్శించుకున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని మంగళవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చక్రపాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా అలంకృతురాలైన దుర్గకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి మండలి సమావేశాలు వెలగపూడిలో శాసనమండలిలోనే జరుగుతాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టసభలు పూర్తిగా సహకరిస్తాయని తెలిపారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని ఆకాంక్షించారు.