రెండేళ్ల సుజిత్‌ కథ విషాదాంతం | Boy Who Slipped Down Into Borewell Was Died In Tamilnadu | Sakshi
Sakshi News home page

రెండేళ్ల సుజిత్‌ కథ విషాదాంతం

Oct 29 2019 7:57 AM | Updated on Oct 29 2019 11:54 AM

Boy Who Slipped Down Into Borewell Was Died In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరు బావిలో పడ్డ మూడేళ్ల సుజిత్‌ కథ విషాదాంతమైంది. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. గత శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు 72 గంటలు పాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుమారు 600 అడుగుల మేర లోతు ఉన్న బోరుబావిలో 100 అడుగుల దగ్గర సుజిత్‌ చిక్కుకున్నాడు.  ఈ నేపథ్యంలో బోరుబావి నుంచి తీసిన మృతదేహాన్ని మనప్పరాయ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బాలుడి స్వస్థలమైన నాడుకట్టుపట్టికి అంబులెన్స్‌లో తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement